కామారెడ్డి, ఫిబ్రవరి 23: కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు. కామారెడ్డి అదనపు కలెక్టర్ ఆయన సుమారు ఆరు నెలలపాటు విధులు నిర్వర్తించారు. కాగా ఆయన స్థానంలో ప్రభుత్వం ఎంకా ఎవరినీ నియమించలేదు.