నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 3: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిరిమల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు ఉద్యోగ మేళాలో పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు రావాలని తెలిపారు. వివరాలకు 9581 768413, 9948748428, 995945679 3 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
కామారెడ్డి, జనవరి 3 : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని మొదటి అంతస్తులోని రూం నంబర్ 121లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏండ్ల యువతీ యువకులు జాబ్మేళాకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు బయోడేటాతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9573973688, 9848237987, 7671974009 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.