కామారెడ్డి,జూన్ 3 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్ హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.