నేడు క్రిస్మస్ .. క్రైస్తవుల పండుగల్లో అతిముఖ్యమైనది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వేడుకులు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని చర్చిలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
వాడవాడలా క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో సందడి వాతావరణం నెలకొనగా.. వస్త్ర దుకాణాలు, స్వీట్ షాపులు, కేక్ల తయారీ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది.