శక్కర్నగర్, మార్చి 17: వ్యభిచారానికి ఆశ్రయం కల్పించిన ఒకరికి, మరో విటుడికి మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బోధన్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దేవన్ అజయ్కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్ గ్రామంలో ఓ ఇంట్లో వ్యభిచారం కొనసాగుతున్నదనే సమాచారం మేరకు 1 మార్చి, 2019న రుద్రూర్ ఎస్సై రవీందర్, కానిస్టేబుల్ ముత్తయ్య, కె. రవికుమార్, రేఖా పటేల్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. విటుడితో పాటు వారికి ఆశ్రయం కల్పించిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఐ దామోదర్ రెడ్డి కోర్టుకు చార్జ్షీట్ను సమర్పించారు. ఇందులో భాగంగా శుక్రవారం కేసుకు సంబంధించిన సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య విచారించారు.
ఈ కేసులో వాస్తవాలు నిర్ధారణ కావడంతో వ్యభిచారానికి ఆశ్రయం కల్పించిన ఫాతిమాబీకి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు చె ప్పారు. ఒకవేళ జరిమనా కట్టని పక్షంలో అదనంగా ఒక నెల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. అదే విధంగా విటుడు ఊషం మల్కయ్యకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 300 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమా నా కట్టని పక్షంలో 15 రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ఎస్సై రవీందర్, సీఐ జాన్ రెడ్డి, లైజన్ పోలీస్ ఆఫీసర్ శంకర్, సాయన్న సహకరించారని అధికారులు వెల్లడించారు.