వర్ని, మార్చి 9: వర్ని మండలంలోని ఆఫందిఫారం సమీపంలో ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ యువకుడు కొట్టుకుపోగా.. కాపాడేందుకు వెళ్లిన యు వకుడి చిన్నాన్న సైతం గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించిన వివరాలు.. గ్రామశివారులోని వరి పంటకు నిజాంసాగర్ ప్రధాన కాలువలో నుంచి మోటర్ల ద్వారా సాగునీటిని అందిస్తున్నా రు. మోటర్కు చెత్త అడ్డుగా ఉన్నదని తొలగించేందుకు ఆఫందిఫా రం గ్రామానికి చెందిన మోచి నారాయణ (25) సాగర్ కాలువలోకి దిగగా..ప్రమాదవశాత్తు కాలు జారి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న యువకుడి చిన్నాన్న మోచి విజయ్(50).. నారాయణను కా పాడేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బోధన్ ఫైర్ స్టేషన్ అధికారి గంగాదాస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొన్నారు. సాగర్ కాలువలో సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా నీట మునిగిన వారి ఆచూకీ లభించలేదు.
చందూర్లో మరో యువకుడు..
చందూర్ శివారులోని నిజాంసాగర్ కాలువలో గ్రామానికి చెంది న ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చందూర్ గ్రామానికి మొండి విష్ణువర్ధన్ (21) నిజాంసాగర్ కాలువలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. రెస్క్యూ బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. విష్ణువర్ధన్ నిజామాబాద్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. నైట్ డ్యూటీ ముగించుకొని శనివారం ఉదయం చందూరుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.