బాన్సువాడ టౌన్, ఆగస్టు 27: బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ప్రకటించడంపై బోరు, మోటర్ వైండింగ్ మెకానిక్లు హర్షంవ్యక్తం చేశారు. ఈ మేరకు బాన్సువాడ నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం సభాపతి పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
దేశంలో ప్రజల వద్దకు పాలన అనేది అక్షరాల నిజం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని గడప లేదని, ఇందుకు సీఎం కేసీఆర్కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మెకానిక్లలో ఎవరికైనా సొంతిల్లు లేక అర్హులై ఉంటే గృహలక్ష్మి పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులకు బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్కు మెకానిక్ల సంఘం సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.