పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉండగా నిజామాబాద్ నగరంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దాదాపు 15రోజులు దాటినా నగర నడిబొడ్డున నెహ్రూ పార్క్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి ముసుగు వేయలేదు. మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి అక్కడి అధికారులు ముసుగు వేయగా, జిల్లా స్థాయి అధికారులు ఉండే నగరంలో ప్రధాన చౌరస్తాలోని విగ్రహంపై ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం గమనార్హం.