రైతుల మోముల్లో చిరునవ్వులు చిగురిస్తున్నాయి. రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో అన్నదాతలు సంబురాలు చేసుకుంటున్నారు. వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న వేళ పెట్టుబడి పైసలు అందడంతో భరోసా ఏర్పడిందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వానకాలం వరినాట్లు హుషారుగా వేస్తున్నారు. రైతుబంధు పథకం వచ్చినప్పటి నుంచి పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయిందని, రైతు సంక్షేమాన్ని తలచే సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఉండగా వ్యవసాయానికి ఢోకా లేదని రైతులు పేర్కొంటున్నారు.
సాగు సాఫీగా…
బాన్సువాడ రూరల్, జూలై 3 : పంట పెట్టుబడి కింద కేసీఆర్ సర్కారు రైతుబంధు పైసలు నా ఖాతాలో జమ చేసింది. వానకాలం పంట సాగుకు పెట్టుబడి చింత లేదు. సర్కారు ఇచ్చిన పైసలతో ఎరువులు కొని నాట్లు వేసుకుంటాను. కేసీఆర్ సర్కారుకు రుణపడి ఉంటాను. రైతుల కోసం పనిచేస్తున్న గొప్ప సారు సీఎం కేసీఆర్.
– దామరంచ గంగారాం, బోర్లం
ఇది రైతు మేలు కోరే సర్కారు..
బాన్సువాడ, జూలై 3: యావత్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు మేలు చేసేలా పథకాలు పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. చాలా రోజులు రైతులను పట్టించుకున్న నాయకులు లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయినంక రైతులకు మంచి జరుగుతున్నది. అప్పట్లో పంట వేసుకుందామంటే సొసైటీల్లో మందు సంచుల కోసం లైన్లలో నిలబడే పరిస్థితి ఉండె. ఇప్పుడు అలాంటి బాధలు లేవు. రైతుబంధు పథకం ద్వారా రెండు ఎకరాలకు సంబంధించిన డబ్బులు నా ఆకౌంట్లో పడ్డాయి. ఆనందంగా ఉన్నది.
– శ్రీనివాస్, దేశాయిపేట్
సీఎం సారుకు ధన్యవాదాలు
బాన్సువాడ రూరల్, జూలై 3 :వానకాలం పంటలు సాగు చేసే సమయంలో మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడుకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ సారు రైతుబంధు అందిస్తుండు. నిన్ననే నా అకౌంట్లో పంట పెట్టుబడి పైసలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. సమయానికి పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– సాయిలు, రైతు, ఇబ్రహీంపేట్.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..
బాన్సువాడ, జూలై 3: తెలంగాణ అంటేనే దేశానికి రోల్ మాడల్గా తయారైంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు అన్నివిధాలుగా న్యాయం జరుగుతున్నది. గతంలో ఎవ్వరూ రైతులను పట్టించుకోలేదు. రైతుబంధు పథకం రైతులకు చాలా మేలు చేస్తున్నది. పంటలు వేసే సమయంలో పెట్టుబడి కోసం సేట్ల దగ్గరికి పోకుండా చేసింది. మా ఖాతాల్లోనే పెట్టుబడి సాయం డబ్బులు వేయడం హర్షణీయం.. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్లను మరిచిపోం.
– విఠల్ రెడ్డి, రైతు పాత బాన్సువాడ
కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు కలిసొచ్చింది…
నస్రుల్లాబాద్, జూలై 3: మాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. గతంలో పంట పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అప్పు చేసి బోరు బావుల కింది సాగు చేసేవాళ్లం. అప్పట్ల కరెంటు సక్రమంగా ఉండకపోవడంతో సరైన దిగుబడి రాక నష్టాలు వచ్చేవి. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రైతులకు కలిసొచ్చింది. కరెంటు రంది లేదు.. పెట్టుబడికి ఇబ్బంది లేదు.
– కర్ణం భాస్కర్ యువ రైతు,మైలారం,నస్రుల్లాబాద్.
టైమ్కు డబ్బులు వస్తున్నాయి..
నస్రుల్లాబాద్, జూలై 3: నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. రూ.10వేలు సాయం అందింది. నాట్లు వేసే కూలీలకు చెల్లించగా మిగిలిన డబ్బులతో ఎరువులు కొన్నాను. వ్యవసాయ పనులు చేసే సమయంలో రైతుబంధు డబ్బులు టైంకు రావడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ రైతుబంధుతోపాటు ఉచిత కరెంటు ఇవ్వడంతో వ్యవసాయానికి తిప్పలు తప్పాయి.
– కెతావత్ నరేశ్, రైతు,లింగంపల్లి తాండ, నస్రుల్లాబాద్.
అప్పు కోసం తిరుగుడు తప్పింది…
నస్రుల్లాబాద్, జూలై 3 : నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. దానిని సాగు చేయాలంటే చేతిలో చిల్లి గవ్వలేక బ్యాంకులు, తెలిసిన వారి వద్ద అప్పు కోసం తిరిగేది. రోజుల తరబడి తిరిగినా అప్పు దొరికేది కాదు. ఇప్పుడు ఆ బాధ లేదు. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నడు.
– మామిండ్ల సాయిరెడ్డి,రైతు, బొమ్మన్దేవ్పల్లి, నస్రుల్లాబాద్.
ఎవుసం పండుగలా మారింది…
నాకు ఉన్న భూమిలో వరితోపాటు మక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తున్నాను. కేసీఆర్ సీఎం అయ్యాక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 24 గంటలు ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయంతో ఎవుసం పండుగలా మారింది. పండిన పంటను సైతం మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటున్నది. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే సీఎం కేసీఆరే కారణం.
– గొడిసెల నర్సింలుగౌడ్, ఉత్తమ రైతు, నస్రుల్లాబాద్.
షావుకార్ల చుట్టూ తిరిగే రోజులు పోయాయి
బాన్సువాడ రూరల్, జూలై 3 :గతంలో పంటలు సాగు చేసుకోవాలంటే షావుకార్ల వద్ద అప్పు చేస్తుండే. కేసీఆర్ సీఎం అయినంక పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.5వేల చొప్పున సమయానికి మా ఖాతాల్లో జమ చేస్తుండు. దీంతో అప్పు కోసం షావుకార్ల చుట్టూ తిరిగే రోజులు పోయాయి.
– పెద్ద పట్లోల విజయ, బోర్లం.
చాలా సంతోషంగా ఉన్నది…
బాన్సువాడ, జూలై 3: రైతుబంధు పథకంతో ప్రతి పంటకూ పంట పెట్టుబడి సాయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉన్నది. పంటలు వేసుకునే సమయంలో చేతిలో డబ్బులు ఉండని పరిస్థితుల్లో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున బ్యాంకులో వేస్తున్నారు. గతంలో ఎవ్వరూ రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ సారు వచ్చినంకనే మా రైతుల బతుకులు మారాయి.
– గడెమల లక్ష్మి, నడిగడ్డ, బాన్సువాడ