వేల్పూర్, ఫిబ్రవరి 14 : జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాధవ్నగర్, మామిడిపల్లి, అర్సపల్లి, ఆర్వోబీ పనుల పురోగతి, ఎస్టీ, ఎస్టీ సబ్ప్లాన్, రోడ్డు నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, ముప్కాల్ మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులపై మంత్రి ఆరా తీశారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమ్గల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఆర్ అండ్బీ గెస్ట్హౌస్ డిజైన్ను పరిశీలించారు. సమీక్షా సమావేశంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్అండ్బీ సీఈ(అడ్మిన్) సతీశ్, క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ పుల్లదాస్, ఈఈ యుగేందర్రెడ్డి, జిల్లా ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, ఈఈ రమేశ్, డీఈ రవీందర్రెడ్డి, ఏఈ నర్సయ్య, ఇరిగేషన్ ఈఈ భానుప్రసాద్ పాల్గొన్నారు.