వేల్పూర్, అక్టోబర్ 17 : మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, తక్కుల్లపల్లి రవీందర్రావు, రాజేశ్వర్రావు తదితరులు మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వేముల తల్లి మంజులమ్మ చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. మంత్రి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్,నాయకులు ఉన్నారు.