బాన్సువాడ, అక్టోబర్ 17 : తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. రాను న్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మం డలంలోని భైరాపూర్ గ్రామానికి చెందిన 300 దళిత కుటుంబాల సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు మంగళవారం బాన్సువాడ పట్టణంలో స్పీకర్ను కలిసి ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న పోచారం, బీఆర్ఎస్ పార్టీని గెలుపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తనకు మద్దతు తెలిపిన భైరాపూర్ దళిత కుటుంబాలకు స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, శంకర్ తదితరులు ఉన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం మోస్రా రామాలయ దర్శనానికి వెళ్లారు.
అక్కడే ఉన్న ఓ తల్లి తన కవల పిల్లలతో సభాపతి వద్దకు వచ్చింది. స్పీకర్ పిల్లలను ఎత్తుకొని ఆడించారు. కేసీఆర్ కిట్టు అందిందా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టే వరకు కంటికి రెప్పలా ప్రభుత్వం కాపాడుతున్నదన్నారు.
– మోస్రా (చందూర్), అక్టోబర్ 17