పోతంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని( Congress failures ) ఆరోపిస్తూ బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలో సోమవారం పోతంగల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూదం నవీన్ ( Sudam Naveen ) పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పోతంగల్ బస్టాండ్ ఆవరణలో సోమవారం నిర్వహించే మహాధర్నాకు మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్,మాజీ ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.