బాన్సువాడ టౌన్, జనవరి 28: పట్టణంలోని ఓ నగల వ్యాపారిపై దుండగులు మత్తుమందు చల్లి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించిన వివరాలు.. బాన్సువాడ పట్టణంలోని జెండాగల్లీలో ఉన్న శ్రీ శివదుర్గ నగల దుకాణానికి ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చారు.
దర్గాలో సమర్పించడానికి ఒక గురిజ బంగా రం కొనుగోలు చేశారు. బిల్లు తీసుకుంటుండగా నగలదుకాణం యజమాని నాగులగామ విఠల్ను మాటల్లో పెట్టిన దుండగులు ఆయనపై మత్తుమందు చల్లారు. 15 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన యజమానికి దుకాణంలో బంగారం దాచుకునే స్టీల్డబ్బా కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 91 గ్రాముల బంగారం దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొనగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.