నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 29: తన తల్లిద్రండులు సెల్ ఫోన్ కొనివ్వడం లేదంటూ ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హమాల్వాడి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి మూడో టౌన్ ఎస్సై జి. శ్రావణ్ గురువారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
హమాల్వాడి ప్రాంతానికి చెందిన శివాణి(16) మోపాల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సదరు బాలిక సెలవుల్లో ఇంటికి వచ్చింది. తిరిగి పాఠశాలకు వెళ్లమంటే సెల్ఫోన్ కొనిస్తేనే వెళ్తానని చెప్పడంతో తల్లిదండ్రులు కొనివ్వలేదు. దీంతో శివాణి తల్లిద్రండులు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ తెలిపారు.