నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 16 : జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు పర్యవేక్షణలో సాయంత్రం వరకు నిర్వహించారు. ఈవెంట్స్కు 1,200 మంది అభ్యర్థులకు గాను 1,060 మంది హాజరయ్యారు. మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రిక్వేన్సి ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్ల (ఆర్ఎఫ్ఐడీ)ను ఉపయోగించారు.
అభ్యర్థుల ఎత్తు, కొలతలు నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించారు. అనంతరం పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు. ఇందులో 524 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు స్టేడియానికి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, హోంగార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కేఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, జిల్లా పరిపాలనా అధికారి రామారావు, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్చార్జి మణికంఠ, ఎన్ఐబీ సీఐ ముఖీద్ పాషా, అన్ని డివిజన్ల సీఐలు, ఎస్సైలు, సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్, మహ్మద్ మక్సూద్ హైమద్, గోవింద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీశైలం, ఈ సాఫ్ట్ ఇన్చార్జి కె.వంశీ చక్రవర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లతోపాటు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు.