మద్నూర్, మార్చి 21: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం స్థానికులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. గురువారం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో నాందేడ్ జిల్లా హింగోలి నగరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. హింగోలిలో భూమి కంపించగా.. తెలంగాణ సరిహద్దులో ఉన్న మద్నూర్ వరకు ప్రకంపనలు సంభవించగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూకంపం సంభవించిన సమయంలో తమ ఇంటిపైకప్పు రేకులు కదిలాయని అవల్గావ్కు చెందిన మొగులాజీ తెలిపాడు. తెల్లవారు నిద్రలో ఉన్న తాను ఒక్కసారిగా భూమి కంపించడంతో మేల్కొన్నట్లు మద్నూర్కు చెందిన సందీప్ పేర్కొన్నాడు.