కోటగిరి/ రుద్రూర్, డిసెంబర్ 24 : వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు రైతులకు అండగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి వ్యవసాయ మార్కెట్కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కమిటీ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి స్పీకర్ పోచారం హాజరై నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అబ్దుల్ హమీద్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించామని తెలిపారు.
సీసీ రోడ్డు, జీపీ భవనం ప్రారంభం..
కోటగిరి మార్కెట్ కమిటీ యార్డులోకి నూతనంగా వేసిన సీసీ రోడ్డును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కోటగిరి మండలకేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు సైలంపూర్ హౌగీరావు తల్లి ఇటీవల మృతిచెందింది. బాధిత కుటుంబాన్ని స్పీకర్ పరామర్శించారు. అనంతరం పొతంగల్ మండలం జల్లాపల్లి ఆబాదిలో రూ. 26లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
కోటగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్కు రుద్రూర్, కోటగిరి నాయకులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిశోర్బాబు, విండో చైర్మన్ కూచి సిద్ధు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ఖాన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, నాయకులు వల్లెపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ హెచ్.స్వరూప, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.