నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని సోమవారం ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఏడాదంతా సుఖశాంతులతో ఉంచాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఉత్తర తిరుపతి, నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, జెండా బాలాజీ మందిరం తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.