నస్రుల్లాబాద్, డిసెంబర్ 31 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 40 డబుల్ బెడ్రూం ఇండ్లకు ఆయన శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో 10వేల డబుల్ బెడ్రూం ఇండ్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంజూరు చేయించారని అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాలనే సంకల్పంలో ముందుకెళ్తున్నారన్నారు. అనంతరం పీఆర్టీయూ క్యాలెండర్ను ఉపాధ్యాయులు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సాయిలు, మండల విద్యాధికారి నాగేశ్వర్రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు హన్మాండ్లు, విండో చైర్మన్ గంగారాం, వైస్ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్సింగ్, కిశోర్ యాదవ్, దుర్గం శ్యామల, కంది మల్లేశ్, నారాయణ, లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించిన డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ, డిసెంబర్ 31 : బాన్సువాడలోని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్వగృహంలో బాన్సువాడ మం డల పీఆర్టీయూ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి బోధన అందించాలని అన్నా రు. అనంతరం పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత సంవత్సరం పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా సాధిస్తారని తెలిపారు. ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, మహ్మద్ ఎజాస్, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్, లక్క నరహరి, ముకల విఠల్, శివ నాయక్, రామకృష్ణ, శ్రీనివాస్గౌడ్, రమేశ్ గౌడ్, లక్క నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.