తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. ఇది విద్యతోనే సాధ్యమని పిల్లలను బాగా చదివిస్తారు. ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు లేకపోవడంతో పస్తులుండైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించేవారు. ఇదంతా గతం.. పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మనఊరు – మనబడి’, ‘మనబస్తీ మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. విడుతల వారీగా పాఠశాలలను ఎంపికచేసి అభివృద్ధి చేస్తున్నది. భారీగా నిధులను కేటాయించి సకల సౌకార్యలను కల్పిస్తున్నది. బోధన్ పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ఉర్దూమీడియం పాఠశాల ఒకప్పుడు పాడుబడిన భవనంలో కొనసాగేది. బనబస్తీ – మనబడి కార్యక్రమం కింద ఈ పాఠశాలను అభివృద్ధి చేయడంతో నేడు ప్రైవేట్ బడులను తలదన్నేలా మారింది.
రూ.21.45 లక్షలతో అభివృద్ధి..
గాంధీనగర్ ప్రభుత్వ ఉర్దూమీడియం పాఠశాలకు బనబస్తీ – మనబడి కింద మొత్తం రూ.21 లక్షల 44వేల 834 నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ.10.13 లక్షల వ్యయం తో సివిల్ పనులను పూర్తిచేశారు. ప్రహరీతోపాటు తాగునీటి వసతి కోసం మినీ ట్యాంకులు, కిచెన్ షెడ్డు, వాష్ బేసిన్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించారు. ప్రతి తరగతి గదిలో విద్యుత్ సౌకర్యం కల్పించి ఫ్యాన్లు బిగించారు. ముళ్లపొదలతో ఉన్న పాఠశాల ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సర్కారు సంకల్పంతో పాఠశాల తీరే మారిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటును వద్దని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఐదు తరగతులకు గాను గదులతో పాటు, సరిపడా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు.
అన్ని సౌకర్యాలు సమకూర్చారు..
గతంలో మా పాఠశాల చాలా అధ్వానం గా ఉండేది. సౌకర్యాలు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. ఎంత నచ్చజెప్పినా తల్లిదండ్రులు కూడా పిల్లలను బడికి పంపేవారు కాదు. రాష్ట్ర ప్రభత్వం ‘మన బస్తీ- మనబడి’ కింద భారీగా నిధులు మంజూరు చేసి అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇప్పుడు పాఠశాల చా లా కొత్తగా మారింది. పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసే సి ఇక్కడికే పంపిస్తున్నారు.
-ఎంఏ వాహెద్, హెచ్ఎం, గాంధీనగర్, ప్రాథమిక పాఠశాల
కొత్త బడికి వచ్చిన..
ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన. గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది. మంచి క్లాస్ రూము లు, టాయిలెట్స్, వాష్ బేసిన్లు ఉన్నా యి. చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూళ్లో కూడా ఇంత మంచి సౌకర్యాలు లేవు. పాఠాలు మంచిగా చెప్తున్నరు.
-ఒమేరా బేగం, 5 తరగతి