నిజాంసాగర్, ఫిబ్రవరి 25: గిరిజనుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో శనివారం అధికారికంగా సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి నిర్వహించగా.. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఆత్మగౌరవానికి మారుపేరు గిరిజనులని, వారి అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. సేవాలాల్ ఆలయాలను ప్రతి తండాలో నిర్మించినట్లు చెప్పారు. సేవలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో నేడు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 9 శాతం ఉన్న గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అని పేర్కొన్నారు. సేవాలాల్ మహరాజ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంతకు ముందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు, మహిళలు, చిన్నారులు, పెద్దలు నృ త్యాలు చేస్తూ వేడుక స్థలానికి చేరుకున్నారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూల మాల వేసి భోగ్ భండార్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో రాజాగౌడ్, గిరిజన నాయకులు బద్యానాయక్, నాయకులు సాయాగౌడ్, నీలూపటేల్, మాధవ్ రావ్దేశాయ్, గంగాధర్ శివానంద్, రాములు, ఆయా మండలాల నుంచి వచ్చిన గిరిజన నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.