ముప్కాల్, డిసెంబర్ 30 : మండలంలోని రెంజర్ల గ్రామంలో రెండు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో పోచంపాడ్తో తలపడిన తాడ్వాయి జట్టు విజేతగా నిలిచింది. పోచంపాడ్ రన్నరప్గా, కలిగోల్, బోధన్ జట్లు వరుసగా తృతీయ, నాల్గో స్థానాలను దక్కించుకున్నాయని నిర్వాహకులు రాకేశ్, ఇలియాస్ తెలిపారు. ముగింపు కార్యక్రమానికి సీపీ నాగరాజు హాజరై విజేతలకు ట్రోఫీతోపాటు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను గ్రామ పెద్దలు, యువజన సంఘాలు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజారెడ్డి, ఎంపీపీ సామ పద్మావెంకట్రెడ్డి, జడ్పీటీసీ బద్దం నర్సవ్వా నర్సారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, ఆర్ముర్ సీఐ గోవర్ధన్రెడ్డి, ముప్కాల్, మెండోరా, బాల్కొండ ఎస్సైలు ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోపి, ఉప సర్పంచ్ మోహన్రెడ్డి, సొసైటీ చైర్మన్ కే గంగాధర్, పీడీలు మల్లేశ్ గౌడ్, పవన్ పాల్గొన్నారు.