శక్కర్నగర్, ఫిబ్రవరి 19: బోధన్ ఆర్టీసీ డిపో నుంచి మహారాష్ట్రకు వెళ్లే సర్వీసులను నిలిపివేసినట్లు బోధన్ డీఎం శ్రీనివాస్ సోమవారం తెలిపారు. మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా సాగుతున్న నేపథ్యంలో బస్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. బోధన్ నుంచి నాందేడ్కు వెళ్లే ఐదు బస్సులు, దెగ్లూర్కు రెండు, ఔరాద్కు రెండు, కందకుర్తి మీదుగా ధర్మాబాద్కు నడిపే రెండు బస్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
అక్కడి పరిస్థితులు సానుకూలంగా మారిన అనంతరం సర్వీసులను కొనసాగిస్తామని డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. రెండు రోజులుగా ఈ బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.