సుభాష్నగర్, ఏప్రిల్ 12: బాలల్లోని సృజనాత్మకతను పదును పెట్టేందుకు ఇందూరు నగరంలోని బాల్భవన్ ఆధ్వర్యంలో ఏటా వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి జూన్ 10 వరకు 53 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రలేఖనం, భరతనాట్యం, జానపదనృత్యం, కర్ణాటక గాత్రం, లలిత సంగీతం, మెహిందీ, నీతిశ్లోకాలు, కథలు, పద్యాలు, ఇంద్రజాలం, స్కేటింగ్, యోగా, కర్రసాము, అల్లికలు, గ్లాస్పెయింటింగ్, వృథావస్తువులతో అందమైన ఆకృతుల తయారీ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. నిత్యం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తరగతులు ఉంటాయి.
వేసవి శిక్షణ తరగతుల్లో చేరే వారి వయస్సు 5 నుంచి 16 ఏండ్లలోపు ఉన్న బాలబాలికలు అర్హులు. రూ. 300 ఫీజు చెల్లించి, 2 పాస్పోర్టు సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ను జతచేసి బాల్భవన్లో దరఖాస్తు చేసుకోవాలి.
మార్చి 25 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 500లకు పైగ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వేసవి నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం కూలర్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నాం. మరిన్ని వివరాలకు బాల్భవన్ కార్యాలయంలో లేదా 9948095698 నవబర్ను సంప్రదించాలి.