డిచ్పల్లి, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు సోమవారం బాజిరెడ్డి సమక్షంలో బీ ఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సం దర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్ర భుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు చేసిందేమీ లేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు మంజూరుచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో సుద్దపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి, ఆర్.గంగాధర్, జి.గంగాసాయిలు, ఎల్. రమణాచారి, రవీందర్, రాములు, నందు, సాకలి దాసు, బా బూరావు, సురేందర్, లింగయ్య, సంజు, రాము, చింతల భూమేశ్, అశోక్, మహేందర్, సతీశ్, నరేందర్, యువకులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసి న ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి ఇందిర, పార్టీ మం డల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్రెడ్డి, సుద్దపల్లి వీడీసీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.