ఒకప్పుడు బాల్బ్యాడ్మింటన్ అంటే మోజు ఉండేది. ఇప్పుడు ఆ క్రీడను ఆడేవారే అరుదు. అలాంటి ఆటపై మక్కువ పెంచుకొని జిల్లా,రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు తిమ్మాపూర్ విద్యార్థులు. జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు ఎక్కడ బాల్బ్యాడ్మింటన్ పోటీలు జరిగినా తిమ్మాపూర్ విద్యార్థులు అందులో పాల్గొంటారంటే అతిశయోక్తి కాదు. బాల్బ్యాడ్మింటన్లో రాణిస్తూ తిమ్మాపూర్ గ్రామానికే ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నారు విద్యార్థులు.
జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్లో తిమ్మాపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న తిమ్మాపూ ర్ విద్యార్థిని ఊట్నూర్ శివాని ఇప్ప టి వరకు మూడుసార్లు జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నది. 2018-19లో కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో, 2022-23లో మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీ ల్లో, 2018-19లో నేషనల్ ఇంటర్ స్కూల్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచింది. అక్ష య అనే మరో విద్యార్థిని రెండుసా ర్లు జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నది. దీక్షిత్ 2023 ఫిబ్రవరిలో మంచిర్యాలలో జరిగిన సబ్జూనియర్ నేషనల్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. బొమ్మెన రచన అనే విద్యార్థిని 1999-20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని నారాయణపురంలో జరిగిన జాతీయస్థాయి స్కూల్గేమ్స్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. రుతిక ఛత్తీస్ఘడ్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. సాయినాథ్ అనే విద్యార్థి అక్టోబర్లో ఛత్తీస్ఘడ్ లో జరిగిన జాతీయస్థాయి బాల్బ్యాండ్మింటన్ సబ్జూనియర్ పోటీల్లో పాల్గొని రజత పతకాన్ని సాధించాడు.
శివాని 2018 నుంచి 2023 వరకు ఆరుసార్లు రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోట్లీ పాల్గొనగా, అక్షయ రెండుసార్లు, దీక్షిత్ రెండుసార్లు, రచన నాలుగు సార్లు, రుతిక ఒకసారి, సాయినాథ్ ఒకసారి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయిలో జరిగే ప్రతి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో తిమ్మాపూర్ విద్యార్థులు పాల్గొనడం విశేషం.
తిమ్మాపూర్ ఉన్నత పాఠశాల పీడీ శ్యామ్ శిక్షణ, ప్రోత్సాహంతో తిమ్మాపూర్ విద్యార్థులు బాల్బ్యాడ్మింటన్లో జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. విద్యార్థులకు బాల్బ్యాడ్మింటన్లో ప్రత్యేక శిక్షణను ఇస్తుండడంతోపాటు ప్రతి వేసవికాలంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో ఇక్కడి విద్యార్థులకు ఈ ఆటపై మక్కువ పెరగడంతోపాటు మెళకువలు నేర్చుకుంటూ జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఎదిగారని చెప్పవచ్చు.
బాల్బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించిన నుంచి ఆటపై ఇష్టం పెరిగింది. ఇష్టంతో ఆడడం వల్లే రాణించగలుగుతున్నాం. ఆటలో చేసిన తప్పులను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపర్చుకొని ప్రతిభ చూపగలుగుతున్నాం. టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతిసారీ చేసిన తప్పులను తెలుసుకుంటూ ఆ తప్పులు తిరిగి చేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.
తిమ్మాపూర్ ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు ఉద యం, సాయంత్రం రోజూ బాల్బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తాను. దీంతో విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. జిల్లాస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. విద్యార్థులకు శిక్షణను ఇవ్వడంతోపాటు టోర్నమెంట్లకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు.