మాక్లూర్, మే 22 :తండ్రి ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్వీ కరించడం అభినందనీయమని, సొంతూరిలో ఆలయాలను నిర్మించడం శుభపరిణామమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. మాక్లూర్ మండల కేం ద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్తా నిర్మించిన అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణీ పాండు రంగ విఠలేశ్వర దేవత ప్రతిష్ఠ పునఃశ్చరణ మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తన తండ్రి బాటలో నడుస్తూ ఆధ్యాత్మిక వారసత్వం కూడా స్వీకరించి సొంత గ్రామంలో ఆలయం నిర్మించడం మంచి పరిణామమన్నారు. ఊరి నడిమధ్యలో ప్రజల దర్శనార్థం ఎంతో గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దారన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రా వు, నగర మేయర్ దండు నీతూకిరణ్, మా క్లూర్ సర్పంచ్ అశోక్రావు, వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం పూజల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
దేవత ప్రతిష్ఠ పునఃశ్చరణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్తా దంపతులతోపాటు కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి ప్రార్థన, శాంతి పాఠం, గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, ఉదకశాంతి, పంచగవ్య ప్రాశనం, దీక్షదారణ, రుత్విగ్వరణం, నాందీ దేవతాహ్వానము, ద్వారపూజ, షోడష స్తంభ దేవతాహ్వానము, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ, నవగ్రహ, మాతృవియోగిని, వాస్తు, క్షేత్రపాలక సహిత సర్వతోభద్రమండప స్థాపన ఆవాహన, షోడషోపచార పూజ, అంకురారోపణం, అరణీ మ థనం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హవనం, ఆవాహిత దేవతా హోమం, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. సా యంత్రం ఆవాహిత దేవతా సాయంకాల ప్రదోషకాల పూజ, యంత్రశుద్ధి, యంత్ర వి గ్రహ జలాధివాసం, నీరాజనం, మంత్రపు ష్పం కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు.