విద్యానగర్, డిసెంబర్ 2 : జిల్లా స్థాయి జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్సీ-2022 ప్రదర్శన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న శాస్త్రీయ ద్రుక్పథాన్ని పెంపొందించుటకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు.
జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనలో 94 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఇందులో ఆరు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు బుక్స్, సర్టిఫికెట్ అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీపతి, గంగకిషన్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత, బాపురెడ్డి, ప్రవీణ్, శ్రీనివాస్, శ్రీధర్, ప్రతాప్ రెడ్డి, వివిధ పాఠశాలల గైడ్ టీచర్స్ పాల్గొన్నారు.