ఖలీల్వాడీ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు టీజీ కోడ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తి కనబర్చారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబా ద్, బోధన్, ఆర్మూర్లో రవాణాశాఖ కార్యాలయాలుండగా ఫ్యాన్సీ నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్లో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. నిజామాబాద్కు టీజీ 16 0001, ఆర్మూర్కు టీజీ 16 ఏ 0001, బోధన్కు టీజీ 16బీ 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16ఏ 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52, 66 5, టీజీ 16 0001కు రూ.50వేలు, టీజీ 16బీ 0333నంబర్ రూ. 30వేల ధర పలికింది. నిజామాబాద్ ఆర్టీవోకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.5,40,967, ఆర్మూర్లో రూ.1,38,585, బోధన్లో రూ.90,300 ఆదాయం వచ్చింది.