సిరికొండ/ కోటగిరి/ చందూర్/ డిచ్పల్లి/ మాక్లూర్/బోధన్ రూరల్/ ఆర్మూర్టౌన్/ ఎడపల్లి/రెంజల్, ఏప్రిల్ 1 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు, సభ్యులతో కలిసి సోమవారం ప్రారంభించారు. సిరికొండ సహకార సంఘం పరిధిలోని కొండూర్, పెద్దవాల్గోట్, సిరికొండలో కొనుగోలుకేంద్రాలను జిల్లా కొనుగోలు కేంద్రాల పరిరక్షణ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. కోటగిరి సహకార సంఘం, పొతంగల్ సహకార సంఘం పరిధిలోని కల్లూర్, పొతంగల్, హెగ్డోలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోటగిరి విండో సీఈవో విఠల్, పొతంగల్ ఏఈవో సుప్రియ ప్రారంభించారు. చందూర్లో కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో సౌజన్య, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాలు ఏ- గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,203, బీ – గ్రేడ్ రకానికి రూ.2,183 అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిచ్పల్లి మండలంలోని లింగసముద్రం, యానంపల్లి తండా, యానంపల్లి, సుద్దులం, కోరట్పల్లి, కోరట్పల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, వైస్చైర్మన్ కుమ్మరి చిన్నగంగారాం ప్రారంభించారు. మాక్లూర్ మండలంలోని చిక్లీ, కొత్తపల్లి, గుంజిలి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాక్లూర్ పీఏసీఎస్ చైర్మన్ బూరోళ్ల అశోక్ ప్రారంభించారు.
బోధన్ మండలంలోని పెంటాకలాన్, అమ్దాపూర్ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవీందర్ ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఆర్మూర్ పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఎడపల్లి మండలకేంద్రంతోపాటు ఒడ్డపల్లి గ్రామంలో ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజితా యాదవ్, సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి మాట్లాడారు. రెంజల్ మండల కేంద్రంతోపాటు నీలా, దూపల్లి సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ధాన్య కొనుగోలు కేంద్రాలను సీఈవోలు రాము, రాందాస్, జీవన్రెడ్డి, ఎండీ సనా ఉల్హాక్ ప్రారంభించారు.
డిచ్పల్లి, ఏప్రిల్ 1: మండలంలోని యానంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు.. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి సోమవారం పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లయీస్ డీఎం జగదీశ్ ఉన్నారు.