కోటగిరి /చందూర్, ఏప్రిల్ 8: వర్ని, చందూరు, కోటగిరి, రుద్రూర్, బోధన్ తదితర మండలాల్లో సోమవారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. టాక్లీ, సోంపూర్, కొల్లూర్, సుంకిని తదితర గ్రామాల్లో కురిసిన వడగండ్లతో వరి పైర్లు దెబ్బతిన్నాయి. వడ్లు రాలిపోయాయి.
చేతికొచ్చిన ధాన్యం నేలపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, పంట కోసి ఆరబోసిన వడ్లు సైతం తడిసి ముద్దయ్యాయి.