నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 27: చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని, పెండింగ్ కేసులను తగ్గించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. 13 వర్టికల్ వ్యవస్థల గురించి క్షుణ్ణంగా చర్చించారు. బెల్లఫామ్ నిర్వహణపై జాగ్రత్తలు, అబాండెంట్ వాహనాల వేలం గురించి వివరించారు. షీ టీమ్స్ మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. చిన్నపాటి నేరాలు కూడా జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు చేయాలన్నారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టంలో ఎఫ్ఐఆర్లు, కేసుల పరిశోధనా వివరాలను ఎప్పటికప్పడు పొందుపర్చాలని సూ చించారు. రాత్రిపూట తనిఖీలు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. పెండింగ్ చలాన్ల వసూలుపై దృష్టిపెట్టాలని సూచించారు. పాత నేరస్తులు తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. వీసీలో సీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటేశ్వర్, కిరణ్కుమార్, ఎస్బీఐ శ్రీశైలంతోపాటు వర్టికల్ ఆఫీసర్లు, సీఐలు పాల్గొన్నారు.