మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన ప్రత్యేక పూజలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు లైన్లలో భక్తులు బారులుతీరి కనిపించారు.
ఆలయాల్లో బిల్వపత్రాలతో పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా శివపార్వతుల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిపించారు. భక్తుల జాగరణ దృష్ట్యా ఆలయాలను సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు, అధికారులు ఏర్పాట్లు చేశారు.