మోస్రా (చందూర్), డిసెంబర్ 12 : మోస్రా మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై మండల నాయకులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తిచేయించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ పిట్ల ఉమా శ్రీ రాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, సర్పంచులు నరేందర్రెడ్డి, సున్నం భూమయ్య, విమలా లింగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, సొసైటీ చైర్మన్లు సుధాకర్రెడ్డి, గుడిపల్లి గంగారెడ్డి, నాయకులు సాయాగౌడ్, అశోక్, ఫిరోజ్ పాల్గొన్నారు.