రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హరితోత్సవం నిర్వహించారు. నియోజకవర్గాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్షిండే, ఆశన్నగారి జీవన్రెడ్డి, మహ్మద్ షకీల్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మొక్కలు నాటి నీళ్లు పోశారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రారంభించిన హరితహారంతో కలిగిన ప్రయోజనాలను అధికారులు వివరించారు.