బాన్సువాడ రూరల్, నవంబర్ 24 : బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు రూ.10వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తండా, కోనాపూర్, పులిగుండుతండా, హన్మాజీపేట్, సంగోజీపేట్, తాడ్కోల్, బుడ్మి, కొత్తాబాది, తిర్మలాపూర్, మొగులాన్పల్లి, మొగులాన్పల్లితండా, దుంకుడు మోరితండా గ్రామా ల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామాలకు వచ్చిన పోచారానికి మహిళలు బోనాలు, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టుతోపాటు సిద్దాపూర్ రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నడుంబిగించి సఫలీకృతం అయ్యానని చెప్పా రు. గట్టుమీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కాద్లాపూర్, సోమ్లానాయక్ తండా, పులిగుండు తండా తదితర గ్రామాల బీడు భూములకు రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందించేందుకు రూ.200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. రిజర్వాయర్ పనులను వేగవంతంగా కొనసాగుతున్నాయని, వచ్చే జూన్ నాటికి సాగు నీరు అందించడమే తన లక్ష్యమని రైతులకు బరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే పోచారం గెలుపు తప్పని సరి అని, రైతులు, గట్టుమీది గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందు వచ్చి సిద్దాపూర్ రిజర్వాయర్ కావాలి.. పోచారం గెలవాలని నినాదాలు చేస్తూ ఊరురా బైక్ ర్యాలీ చేపట్టాలని రైతులకు, బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలే నా బలగం.. బలం అని, తాను మరణించినా కట్టే కాలేది ఇక్కడేనని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పక్క నియోజకవర్గాల్లో చెల్లని నాయకులు ఇక్కడకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఓటు హక్కుతో వారిని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఏనుగు రవీందర్ భూ కబ్జాకోరని అన్నారు. కోనాపూర్, హన్మాజీపేట్, సంగోజీపేట్ గ్రామాల్లో 627,32 సర్వే నంబర్లోని భూములకు పోడు పట్టాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బోర్లంక్యాంపు, కోనాపూర్, బుడ్మి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్పీకర్ పోచారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగోజీపేట్ గ్రామంలో పలు కుల సంఘాలు పోచారానికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు ఇచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు సంగమేశ్వర్ ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.11వేలు పోచారానికి అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్రెడ్డి ఒక భూ భకాసురుడని, పేద ప్రజలను పీడించే నాయకుడని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ప్రజలకు తిప్పలు తప్పవని ఏనుగు రవీందర్రెడ్డి సొంత గ్రామమైన ఎర్రాపహాడ్కు చెందిన రైతులు చిట్యాల సాయిలు, బాలయ్య, దుర్గవ్వ అన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, ఎంపీపీ, జడ్పీటీసీలు దొడ్ల నీరజారెడ్డి, పద్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, సర్పంచులు వెంకటరమణారావు, రాజమణి, లక్ష్మి, అంకిత, ఎంపీటీసీ సభ్యులు హన్మాండ్లు, సుధాకర్రెడ్డి, ఇంద్ర, రుక్మిణి, డీసీసీబీ డైరెక్టర్లు సంగ్రాం నాయక్, భూషన్రెడ్డి, బుడ్మి, బాన్సువాడ సొసైటీ చైర్మన్లు గంగారాం, కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, గురువినయ్కుమార్, గోపాల్రెడ్డి, బాల్సింగ్, ప్రశాంత్కుమార్, సామేందర్, శంకర్గౌడ్, రాజేశ్వర్గౌడ్, సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.