బాన్సువాడ, నవంబర్ 23 : ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచి ప్రజలకు మంచి చేయడమే తెలుసని.. తనపై నిందలు మోపినా ఏ ఒక్కరినీ పల్లెత్తు మాటలు అనలేదని అన్నారు. కానీ ఇటీవల ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి తన వయస్సును కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడ న్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, ప్రజలకు చేసే పనులను చెప్పాలని హితవు పలికారు. పోటీ చేయడం తప్పుకాదని కానీ.. బాన్సువాడ ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలన్నారు. ఎల్లారెడ్డిలో ఆయన దౌర్జన్యాలు చేయడంతోనే అక్కడి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కర్ణాటకలో అయిదు హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయలేక చేతులు ఎత్తేసిందన్నారు. తెలంగాణలో ఆరు హామీలు ఇచ్చారని, పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, హామీలను ఎవరు అమలు చేస్తారని ప్రశ్నించారు. నెలకో ముఖ్యమంత్రి చొప్పున సీటు కోసం కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు.
రవీందర్ రెడ్డి పుట్టింది ఎల్లారెడ్లిలో, ఉండేది హైదరాబాద్లో , రేపు సమస్యలు ఏమైన వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ల్లి అడగాలని ప్రశ్నించారు. నేను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరుగానని, ఇక్కడే ఉంటున్నానని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే ఉందని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. స్పీకర్ వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీలు స్పీకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. స్పీకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీర్కూర్ మండల కేంద్రంలో అన్ని కులసంఘాలు స్పీకర్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ రఘు , జడ్పీటీసీ స్వరూపాశ్రీనివాస్, వెంకట్రెడ్డి, ప్రదీప్ పంతులు, నబీ, వైస్ ఎంపీపీ కాశీరాం, సర్పంచులు నాగేశ్వర్ రావు, విఠల్, కృష్ణారెడ్డి, స్వప్ప, గంగారం, ఎంపీటీసీ గంగారాం, చైతన్య, సిద్ధార్థ, మియాపురం శశికాంత్, హైమద్, దుంపలపల్లి రాజు, ఎంపీటీసీ సందీప్ పటేల్, లాడేగాం వీరేశం, అంజాగౌడ్, ద్రోణవల్లి అశోక్, రాంబాబు, రాజేశ్, బాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.