బాన్సువాడ రూరల్/బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ నస్రుల్లాబాద్/మోస్రా(చందూర్)/కోటగిరి/వర్ని, నవంబర్ 3 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించా రు. బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పోచారాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బోర్లం, బుడ్మి సొసైటీ అధ్యక్షులు గంగారాం, సంగ్రాంనాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బాన్సువాడలోని 19 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, శివ, యూనుస్, ఏఎంసీ డైరెక్టర్ ప్రతిమారెడ్డి, యువకు లు పాల్గొన్నారు. బాన్సువాడలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ లింగమేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్, హన్మాండ్లు, రాము, రాజు, శివ, గంగా రాం, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని బాన్సువాడ నేక్ బీబీ దర్గా వద్ద బాన్సువాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలను చేశారు. సీనియర్ నాయకులు మహ్మద్ ఎజాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్, నాయకులు శివ, లాయక్, రహీం, ఇసాక్, సాయిలు, ఆజాం, జాజేర్, తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలం అంకోల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సాయిలు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాము, దుర్కి సర్పంచ్ శ్యామల, నాయకులు పాల్గొన్నారు. మోస్రాలో 81 బూత్లో, బూత్ లెవల్ కమిటీ ప్రచార కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ పోచారాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బూత్ లెవల్ కన్వీనర్ దేవేందర్, మైనారిటీ అధ్యక్షుడు షేక్ అలీం, యూసుఫ్, కలీమ్ పాల్గొన్నారు. కోటగిరి, ఎత్తొండలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేశారు. సర్పంచులు పత్తి లక్ష్మణ్, సిరిగిరి సాయిబాబా, అనిల్ కులకర్ణి, దయానంద్, విజయ్, సంగెం శ్రీనివాస్గౌడ్, శంకర్, ఎంపీటీసీ ఫారుక్, వెంకటేశ్, ఆనంద్, కిశోర్ తదితరులు ఉన్నారు. వర్ని మండలం హుమ్నాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ఇం టింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు లీలా మోహన్, కాయతి నారాయణ పాల్గొన్నారు.
బాన్సువాడ, నవంబర్ 3 : బాన్సువాడ నియోజక వర్గంలోని బీర్కూర్ మండలం నుంచి శనివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ అనంతరం నేరుగా బీర్కూర్ మం డలం తిమ్మాపూర్ గ్రామంలో 12 గంటలకు ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బీర్కూ ర్ తండాతోపాటు మండలంలోని కిష్టాపూర్, చించోలి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.