నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – డీఆర్ అనిల్ కుమార్ దంపతులు నిర్మించిన శ్రీ రాజ్య లక్ష్మి సమేత నరసింహ ఆలయ జీర్ణోద్ధరణ శిలామయ లోహమయ మూర్తుల ప్రతిష్టాపన ఉత్సవంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. స్వామి వార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.