భూసారంతోనే అధిక దిగుబడులు
భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా పంటల సాగు
పరీక్షకు గట్ల దగ్గరి, పంట కాల్వల మట్టి పనికి రాదు..
జక్రాన్పల్లి, మే 28: భూసార పరీక్షలు చేయించి నిపుణుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నేలల్లో సహజంగా ఉన్న పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ, రసాయన ఎరువులతో మొక్కలకు మరిన్ని పోషకాలను అందజేస్తే అధిక దిగుబడికి దోహదపడుతాయి. భూసార పరీక్షలు చేయిస్తే ఎరువుల వినియోగంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. దీంతోపాటు భూసారాన్ని కాపాడుకుంటూ అధిక, సుస్థిర దిగుబడులను సాధించవచ్చు. రైతులు తమ పొలంలో రెండేండ్లకోసారి భూసారపరీక్ష చేయించుకుంటే మేలు. భూమిలో ఉన్న పోషక పదార్థాలే కాకుండా, చౌడు గుణాలు, సున్నపు శాతం, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్షలు ఉపయోగపడుతాయని జక్రాన్పల్లి మండల వ్యవసాయ అధికారిణి దేవిక తెలిపారు.
క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయిస్తే మేలు..
నేల సారవంతంగా ఉంటేనే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయిస్తే నేల స్వభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నేలలో ఏ ధాతువులు లోపించాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. భూమిలో ఉన్న పోషక పదార్థాలే కాకుండా, చౌడు గుణాలు, సున్నపు శాతం, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు మట్టి పరీక్ష చేయించుకోవడం అత్యంత అవశ్యకం. పరీక్షల అనంతరం నిపుణులు సూచించిన విధంగా ఎరువుల వాడకం, సిఫార్సు చేసిన పంటలు సాగుచేస్తే రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చు.
మట్టి సేకరణలో జాగ్రత్తలు..
భూసార పరీక్షల్లో అన్నింటికన్నా ముందు తెలుసుకోవాల్సి విషయం మట్టి నమూనాను సేకరించడం. మట్టి నమూనా సరిగా లేకపోతే భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీంతో నిపుణుల ద్వారా ఒక్కోసారి తప్పుడు సిఫార్సులు అందుతాయి. పెట్టుబడి ఖర్చులు వ్యర్ధమవుతాయి. అందుకే మట్టి నమూనా సేకరణలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలి.
ఇవీ జాగ్రత్తలు