నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారని తెలిపారు. అలాంటి వారికి నైపుణ్య శిక్షణనందిస్తే మంచి వేతనాలు, ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశయంతో తాను మంత్రిగా ఉన్నప్పుడు న్యాక్ శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయించానని గుర్తు చేశారు.
శిక్షణ కేంద్ర భవన నిర్మాణం ప్రారంభించుకునే సమయంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ను రద్దు చేయడం నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి సభలో వివరించారు. శిక్షణ కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు.