సదాశివనగర్/గాంధారి, జనవరి 5 : కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుపై తప్పడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న అభయహస్తం సంక్షేమ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి, గాంధారి మండలం గుర్జాల్ తండాలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలపై దరఖాస్తులు అందజేసినా స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఆర్డీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్లు హిమబిందు, జానకి, ఎంపీడీవో లక్ష్మి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.