కంఠేశ్వర్, ఫిబ్రవరి 25 : నల్గొండ జిల్లాలో నిర్వహించిన 9వ రాష్ట్రస్థాయి సెపక్తక్రా జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్లు సత్తాచాటాయి. బాలికలు సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా, బాలుర జట్టు జూనియర్ విభాగంలో మూడో స్థానంలో నిలిచిందని సెపక్తక్రా అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సంజీవరెడ్డి తెలిపారు.
ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో క్రీడాకారులకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్రెడ్డి బహుమతులను అందించడంతోపాటు అభినందనలు తెలిపారు. బహుమతుల ప్రదానోత్సవంలో డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్రాజ్, హైదరాబాద్ అధ్యక్షుడు సురేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జితేందర్, శ్రీనివాస్రెడ్డి, జరీఫుద్దీన్, వెంకట్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.