ఖలీల్వాడి, నవంబర్ 28 : నగరంలోని స్నేహ సొసైటీకి చెందిన అంధ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆటలపోటీలకు ఎంపికైనట్లు కార్యదర్శి సిద్ధయ్య తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీల్లో స్నేహ సొసైటీ అంధుల పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు.
వి.అక్షయ, బి.సాయిజాన్వి, జి.రాహుల్, ఎండీ ఆసిఫ్, ఎస్కే ఇమ్రాన్, ఎస్కే మహిమ్ఫాతిమా, వై.సంతోష్, బి.గంగోత్రి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. ఈనెల 29, 30, డిసెంబర్ 1వ తేదీల్లో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి దివ్యాంగుల ఆటల పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.