MIZAMABAD | కంఠేశ్వర్, ఏప్రిల్ 02 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.
పాపన్నకు నివాళులర్పించి పలువురు మాట్లాడారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, సీ గంగాధర్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ గౌడ్, గౌడ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారయ్య గౌడ్, నాయకులు చెరకు లక్ష్మణ్ గౌడ్, రత్నాకర్ గౌడ్, తాళ్లపల్లి రాజా గౌడ్, సేపూరి సుమన్ గౌడ్, నాగరాజు గౌడ్ బండి సాయా గౌడ్ మాజీ కార్పొరేటర్ ఉమా శ్రీనివాస్ గౌడ్, అధిక సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.