కోటగిరి, మార్చ్ 11 : సమాజ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఏత్తొండ క్యాంప్ సర్పంచ్ గైని వీరమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ వీరమణి ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్, ఐసిడిఎస్ శాఖ లతో పాటు వివిధ శాఖల మహిళ ఉద్యోగులకు, మహిళా సమాఖ్య సంఘం మహిళలకు, మహిళా సిబ్బందికి శాలువా కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు.
అభివృద్ధికి చదువు ముఖ్యమన్నారు. ప్రస్తుత సమాజంలో పోటీ పెరిగిందని, అన్ని రంగాల్లోను రాణించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. మహిళలల్లో అక్షరాస్యత పెరుగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటరమణ, హెల్త్ సూపర్ వైజర్ సావిత్రి, మాజీ ఉప సర్పంచ్ సుజాత, అర్జున్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ఉమాకాంత్, రాజేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.