నిజామాబాద్ సిటీ : భారత ఉప ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ వల్లబాయి జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సర్దార్ వల్లబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపి అందరిలో సమైక్య స్పూర్తినింపిన వ్యక్తి సర్దార్ వల్లబాయి పటేల్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం దేశ ఐక్యమత్యంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసులు, ఏవో సుదర్శన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.