Sand tractor | బాన్సువాడ రూరల్, జూన్ 6 : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెందాడు.
ఎస్సై నవీన్ చంద్ర కథనం ప్రకారం.. రాజు ట్రాక్టర్ను నడుపుకుంటూ బాన్సువాడ నుంచి కిష్టాపూర్ కు వెళ్తుండగా కొల్లూరు శివారులోని పాత బాన్సువాడకు వెళ్లే దారి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.