నిజామాబాద్ : దళిత బంధు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ప్రకటించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నిజాంసాగర్ మండలంలోని మహమద్ నగర్ కూడలిలో పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.